`కార్తికేయ‌` సీక్వెల్ లో టీవీ రిపోర్టర్ గా స్వాతి?

Swathi Plays TV Reporter In Karthikeya Movie Sequel

2014 నాటి డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ‌`కి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగంలో క‌థానాయ‌కుడిగా న‌టించిన నిఖిల్ ఇందులోనూ హీరోగా న‌టిస్తున్నాడు. అలాగే `కార్తికేయ‌`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చందు మొండేటినే ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు.. అందులో నాయిక‌గా న‌టించిన స్వాతి కూడా ఇందులో ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తుంద‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… ఇందులో స్వాతి టీవీ రిపోర్ట‌ర్ రోల్ లో క‌నిపిస్తుంద‌ని, క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర ఇద‌ని తెలిసింది. మ‌రి… టీవీ రిపోర్టర్ పాత్ర‌లో స్వాతి ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌నున్న `కార్తికేయ‌` సీక్వెల్ 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 17 =