‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: