చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు ఎంటరయి , రాజకుమారుడు మూవీ తో హీరో గా మారిన మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ కాగా లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాశ్మీర్ లో ఒక మూవీ రిపోర్టర్ తో మాట్లాడుతూ .. మాస్ మూవీస్ లో నటించడానికి ఇష్టపడనని, అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచడం తన బాధ్యతని , మాస్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించలేమని, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ తోనే సాధ్యమని, సరిలేరు నీకెవ్వరు మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ అని మహేష్ బాబు చెప్పారు.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.