ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే… గత రెండు చిత్రాల్లో ఫాలో అయిన ఆ సెంటిమెంట్ని… విడుదలకు సిద్ధమైన తన తాజా చిత్రం ‘మహర్షి’లో కూడా కంటిన్యూ చేసాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ సెంటిమెంట్ పేరే… జయసుధ. గత కొంతకాలంగా తల్లి పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్న ఈ సహజ నటి… వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’లో కూడా భాగమయ్యారు. ఈ సినిమాలో మహేష్కి తల్లిగా నటించారు జయసుధ. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో వంశీ దర్శకత్వంలో జయసుధ తల్లిగా నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… వంశీ పైడిపల్లి డైరెక్షన్లో జయసుధ నటించిన తొలి చిత్రం ‘ఎవడు’. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వంశీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలచింది. ఇక కింగ్ నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊపిరి’లో కూడా జయసుధ నటించారు. ఈ సినిమా కూడా వంశీకి విజయంతో పాటు మంచి పేరును తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో… ‘మహర్షి’తో ముచ్చటగా మూడోసారి జయసుధ సెంటిమెంట్ను రిపీట్ చేసాడు వంశీ. విశేషమేమిటంటే… ‘ఎవడు’, ‘ఊపిరి’ చిత్రాల్లో హీరోకు తల్లిగా నటించిన జయసుధ… ‘మహర్షి’లో కూడా మహేష్కు తల్లిగా నటించడం. మరి ‘ఎవడు’, ‘ఊపిరి’ చిత్రాలలో జయసుధ ఫ్యాక్టర్ కలిసొచ్చినట్టుగానే… ‘మహర్షి’లో కూడా ఆమె సెంటిమెంట్ వంశీకి వర్కవుట్ అవుతుందేమో చూడాలి. కాగా… మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=PRms6fc7DN0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: