నందమూరి బాలకృష్ణకు, సంక్రాంతి పండగకు విడదీయరాని అనుబంధముంది. బాలయ్య నటించిన పలు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలై… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. అందుకే… తనకి బాగా అచ్చొచ్చిన ఈ సీజన్లోనే.. తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’(2017)తో పలకరించి ఘనవిజయం అందుకున్నాడు బాలయ్య. ఇప్పుడు ఇదే సీజన్లో తనకు కలిసొచ్చిన స్వరకర్తతో హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడీ నందమూరి హ్యాండ్సమ్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం బాలయ్య తన తదుపరి చిత్రాన్ని జై సింహా
(2018) వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ చిత్రం… జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనుంది. కాగా… ఈ సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ సంగీతం అందించనున్నాడని సమాచారం. ఇప్పటికే బాలయ్య, చిరంతన్ భట్ కలయికలో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘జైసింహా’ చిత్రాలు… ఆ యా సంవత్సరాల్లో సంక్రాంతికి విడుదలై మ్యూజికల్గానూ, బాక్సాఫీస్ నంబర్స్ పరంగానూ మెప్పించాయి. మరి… ముచ్చటగా మూడోసారి అదే సీజన్లో వస్తున్న ఈ కాంబో హ్యాట్రిక్ నమోదు చేసుకుంటారేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=SMLtvf9zm_I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: