టాలీవుడ్ లో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లడం చూస్తూనే ఉంటాం. ఇక ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరికి దక్కడం కూడా చూస్తుంటాం. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ కూడా అదే మాట చెబుతున్నాడు. అడివి శేష్ హీరోగా మేజర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా మేజర్ సినిమా రూపొందింది. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. దీనిలో భాగంగానే అడివి శేష్ కూడా పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. దానిలో భాగంగానే.. చందమామ సినిమాలో ముందు హీరోగా నన్నే తీసుకున్నారని, నవదీప్ స్థానంలో నేను ఉండాల్సింది. రెండు రోజుల షూటింగ్ తర్వాత సినిమా క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు. ఇక సొంతం సినిమాలో పెద్ద రోల్ ఉందని చెప్పారు తీరా చూస్తే ఒక చిన్న సీన్ లో మాత్రమే తీసుకున్నారు అంటూ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అడివి శేష్ టాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన కథలను చేస్తాడు అన్న పేరును అయితే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు. మేజర్ సినిమా రిలీజ్ అవుతుండగా మరోపక్క హిట్ సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకు కూడా మళ్లీ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నాడు. హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కనిపించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: