కరోనా సెకండ్ వేవ్ అనుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్ సినీ పరిశ్రమపై గట్టిగానే దాని ప్రభావం చూపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు దానికి తగిన చికిత్స తీసుకుంటున్నారు. ఇంతకుముందు షూటింగ్ లకు, ప్రమోషన్స్ అంటూ బయటకు వెళ్లడం వల్ల సెలబ్రిటీలు కరోనా బారిన పడేవాళ్లు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్నా కానీ ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మరో నటి తనకు కరోనా నిర్ధారణ అయింది అని చెబుతుంది. ఆమె ఎవరో కాదు రేణూ దేశాయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈవిషయాన్ని తెలియచేసింది. హలో నాకు, అకీరాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. కరోనా సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ.. న్యూ ఇయర్ వేడుక సమయంలోనూ ఇంట్లోనే కూర్చున్నప్పటికీ నాలోను, అకీరాలోను కరోనా లక్షణాలు కనపడ్డాయి.. పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇద్దరం కరోనా నుంచి కోలుకుంటున్నాం.. కోవిడ్ థర్డ్ వేవ్ ని సీరియస్ గా తీసుకోండి. మాస్కులు ధరించండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి.. మీఅందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ సూచించారు.
View this post on Instagram
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: