సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “, “ఖిలాడి “, “ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్” మూవీ లో మంగళం శీను భార్య దాక్షాయణి గా అనసూయ నెగటివ్ రోల్ లో నటించి గుర్తింపు పొందారు. “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ లో అనసూయ క్యారెక్టర్ నిడివి తక్కువ అయినా సెకండ్ పార్ట్ లో నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం.అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతూ అద్భుతమైన రెస్పాన్స్ పొందుతున్న “పుష్ప :ది రైజ్ ” మూవీ పై మరోసారి ప్రశంసలు కురిపించారు. అనసూయ మాట్లాడుతూ .. ఈ మూవీ తన కెరీర్ కు గేమ్ ఛేంజర్ అనీ , ఇప్పటివరకూ టాలీవుడ్ కు మాత్రమే పరిచయం అయిన తాను అన్ని ఇండస్ట్రీస్ కు పరిచయం అవడానికి ఈ మూవీయే కారణమనీ, “పుష్ప :ది రైజ్ ” మూవీ తన జీవితంలో ఎప్పటికీ స్పెషల్ అని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: