జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. 2013 డిసెంబర్ 19న విడుదలై అప్పట్లో కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇటీవలే ఈసినిమా సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా కూడా తీయగా అది కూడా హిట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి సీక్వెల్ తీయడం అంటే డైరెక్టర్ కు కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన తరువాత సీక్వెల్ ను కూడా అదే రేంజ్ లో తీయడం అంటే చాలా కష్టం. కానీ జీతూ జోసఫ్ విషయంలో మాత్రం అది రాంగ్ అని ప్రూవ్ చేశాడు. నిజానికి మొదటి పార్ట్ కంటే సీక్వెల్ నే ఇంకా ఉత్కంఠంగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా నార్మల్ గా చూపించినా ఆ తరవాత వచ్చే ట్విస్ట్ లు మాత్రం ఉత్కంఠంగా ఉంటాయి.
ఇక రెండు పార్ట్ లు వచ్చాయి.. ఇప్పుడు మూడో పార్ట్ కోసం కూడా చూస్తున్నారు దృశ్యం అభిమానులు. అయితే ఈసినిమా తీయడానికి 50-50 ఛాన్స్ లు మాత్రామే ఉన్నాయని అంటున్నారు జీతూ జోసెఫ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీతూ జోసెఫ్ దీని గురించి మాట్లాడుతూ… దృశ్యం 3 స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాను.. ఇప్పటికే క్లైమాక్స్ అయితే రాసుకున్నాను.. మోహన్ లాల్ సర్ తో కూడా డిస్కస్ చేశాను.. ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు.. అయితే దానికి ఇంకా మంచి సీన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది.. మంచి ఐడియాస్ వచ్చినప్పుడు యాడ్ చేస్తుంటాను..నిజానికి ఇప్పుడే పార్ట్ 3 తీయాలని లేదు దానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది అని తెలిపాడు. చూద్దాం మరి పార్ట్ 3 ఎప్పుడు వస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: