జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా వెంకీని పలు ప్రశ్నలు అడుగగా వాటికి సమాధానమిచ్చారు. దీనిలో భాగంగానే.. నారప్ప, ఇప్పుడు దృశ్యం ఈ రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిపోయాయి మరి ఫ్యాన్స్ కి ఎఫ్ 3 తో గట్టి ట్రీట్ ఇస్తారా అన్న ప్రశ్నకు వెంకీ సమాధానమిస్తూ.. తప్పకుండా.. ఈసారి డబుల్ ట్రిపుల్ ట్రీట్ ఖచ్చితంగా నా అభిమానులకు ఉంటుంది. అది కూడా థియేటర్స్ లోనే ఉంటుంది. కానీ సినిమా సమ్మర్ లో అంటున్నారు చూడాలి అంటూ సమాధానమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దిల్రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: