ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు ఒకదాని తరువాత మరోకటి రిలీజ్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక పాటలు అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైపోయింది. దీనిలో భాగంగానే ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం తమిళ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు రూ.7 కోట్లకు తమిళ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. మరి ఇప్పటికే లైకా సంస్థ రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తమిళ హక్కులను కూడా చేజిక్కించుకున్నారు.
కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా…అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా యాంకర్ అనసూయ, సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: