దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. అంతేకాదు ఎన్టీఆర్ ను రామ్ చరణ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి మూడేళ్లు అవ్వడంతో అటు ఎన్టీఆర్ అభిమానులు కానీ చరణ్ అభిమానులు కానీ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ఇటుగా ఈసినిమాకు కూడా బహుబలి సినిమాకు పట్టినంత టైమే పట్టింది. అయితే మధ్యలో కరోనా రావడంవల్ల మరింత ఆలస్యం అయిందనుకోండి. దాదాపు ఏడాదిన్నర పాటు కరోనా వల్లే షూటింగ్ లేట్ అయింది. ఫైనల్ గా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఫస్ట్ చర్చలు మొదలై ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా రాబోతుందన్న వార్తకు బీజం పడటానికి 2017 లో ఇదే రోజున అంటే నవంబర్ 18 న రాజమౌళి తన ట్విట్టర్ లో ఎన్టీఆర్-చరణ్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అప్పట్లో ఆ వార్తపై పెద్ద ఎత్తున వార్తలే వచ్చాయి. ఆతర్వాత అది కన్ఫామ్ అవ్వడం.. షూటింగ్ మొదలవ్వడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని గుర్తుచేసుకుంది చిత్రయూనిట్. నాలుగేళ్ల క్రితం రాజమౌళి పోస్ట్ చేసిన పిక్ తో పలు స్పెక్య్కూలేషన్స్ వచ్చాయి.. మూడేళ్ల క్రితం ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాం.. సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ ను చూడటానికి ఇంకా 50రోజులు ఉంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
4 years since he posted this pic leaving room for so many speculations… 3 years since we began filming #RRRMovie… 50 Days for you to experience the magic on the big screen 💥💥
Oohinchani Chitra Vichitram… Snehaaniki Chaachina Hastham…❤️🙌🏻
Jan 7th, Let’s blast!! https://t.co/S0prnnO4FM
— RRR Movie (@RRRMovie) November 18, 2021
కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: