హైదరాబాద్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళిన షబానా అజ్మీ, ఫరా, టబు, అదితి రావు హైదరీ సక్సెస్ ఫుల్ మూవీస్ తో సత్తాచాటుతున్నారు. ఇప్పుడు మరో హైదరాబాదీ అమ్రిన్ ఖురేషి రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. అమ్రిన్ ఖురేషి ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి తనయ, రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ.ఖురేషి మనవరాలు. గ్లామర్ రోల్స్తో పాటు ట్రెడిషనల్ పాత్రలకు తాను బెస్ట్ ఆప్షన్ అనేలా తనను తాను మౌల్డ్ చేసుకున్న అమ్రిన్ ఖురేషి తెలుగు సూపర్ హిట్స్ “జులాయి “, “సినిమా చూపిస్త మావ”హిందీ రీమేక్ మూవీస్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్బాక్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో నమషి చక్రవర్తి , అమ్రిన్ ఖురేషి జంటగా “సినిమా చూపిస్త మావ ” మూవీ హిందీ రీమేక్ “బ్యాడ్బాయ్” మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సూపర్ డైరెక్టర్ టోని డిసౌజ దర్శకత్వంలో నమషి చక్రవర్తి , అమ్రిన్ ఖురేషి జంటగా “జులాయి” హిందీ రీమేక్ మూవీ తెరకెక్కనుంది. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అమ్రిన్ కథానాయికగా నటిస్తున్న రెండు మూవీస్ లోనూ బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: