“వంశీ “మూవీ లో జంటగా నటించిన మహేష్ బాబు, నమ్రత ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్నారు. వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా “సర్కారు వారి పాట”నుండి చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్లతో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. గోవా లో మహేష్ బాబు షూటింగ్ తో పాటు తన సతీమణి నమ్రత , చిల్డ్రన్ గౌతమ్ , సీతారలతో ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నమ్రత తన ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. నమ్రత తాజాగా మహేష్ బాబు సిగ్నేచర్ లుక్ అంటే చాలా ఇష్టమనీ , తగని ప్రేమ అంటూ మహేష్ బాబు బ్లాక్ &వైట్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: