వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. హీరో ప్రభాస్ , అమితాబ్ ఈ మూవీ ముహూర్తానికి అటెండ్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ లోఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా అమితాబ్ ట్వీట్ చేశారు. 4, 5 రోజుల మినీ షూటింగ్ షెడ్యూల్ లో అమితాబ్ పై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించనున్నారు. ప్రభాస్ హీరో గా “రాధేశ్యామ్ “, “సలార్ “, “ఆదిపురుష్ ” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. 3 భారీ బడ్జెట్ మూవీస్ సెట్స్ పై ఉండగా మరొక భారీ బడ్జెట్ మూవీ ని హీరో ప్రభాస్ ప్రారంభించడం విశేషం.టాలీవుడ్ లో ఒకేసారి 4 మూవీస్ సెట్స్ పై ఉన్న హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: