వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రకటించిన ఇప్పటివరకూ సైట్స్ పైకి వెళ్లలేదు. మధ్యలో వచ్చిన ఆది పురుష్, సలార్ సినిమాలు మాత్రం షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న రెండు సినిమాలు పెద్ద సినిమాలే కావడంతో నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని ఫిక్స్అయిపోయారు అందరూ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గత కొద్దికాలం నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈసినిమా ఫైనల్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టనట్టు తెలుస్తుంది. నేడు ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీని కోసమే అమితాబ్ బచ్చన్ హైద్రాబాద్కు వచ్చారని తెలుస్తోంది. అంచేకాదు కొద్ది రోజుల వరకు హైదరాబాద్ లోనే ఉండి తన షూటింగ్ ను ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాకు మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత సి.అశ్వినిదత్ 500కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: