కరోనా మాత్రం సెలబ్రిటీలను బాగానే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. ఎంతో మంది కరోనా వల్ల చనిపోయారు కూడా. ఇక కరోనా సెకండ్ వేవ్ లో కూాడా సెలబ్రిటీలపై దీని ప్రభావం బాగానే పడుతుంది. ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు మరణించగా.. చాలామందికి కరోనా సోకింది. ఇక నేడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ”నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. నాతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈట్వీట్ పై బుట్టబొమ్మ అదే పూజాహెగ్డే కూడా స్పందించి కాస్త కామెడీ చేసింది. అలవైకుంఠపురములో సినిమాలో బన్నీ- పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో బన్నీ బంటు పాత్రలో నటించగా.. పూజా హెగ్డే అమూల్య పాత్రలో నటించింది. ఈనేపథ్యంలో పూజా హెగ్డే చూడబోతే బంటు అమూల్యకి కంపెనీ ఇస్తున్నట్టు ఉంది.. జాగ్రత్తగా ఉండు.. కొంత శక్తి ని హీలింగ్ పవర్ ను పంపిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. మరి దీనికి బంటు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం..
Buntu seems to be giving Amulya company! 🥺 Take care @alluarjun 🤗 Sending you some healing light and energy ☺️ you’ll be healthy in no time! 😃
— Pooja Hegde (@hegdepooja) April 28, 2021
కాగా పూాజా హెగ్డే కు కూడా ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే తనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని. ఎవరు భయపడొద్దు.వీలైనంత త్వరగా ఆనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. మీరు నవ్విస్తారు, ప్రేమిస్తారు అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజా నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























