కళ్యాణ్ రామ్ కూడా స్పీడ్ పెంచాడు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ‘తుగ్లక్’ అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాను ఎన్టీఆర్ బ్యానర్పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో సినిమాను లాంచ్ చేసాడు. రీసెంట్ గా ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న మేకర్స్ ఈ సినిమాను లాంచ్ చేశారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నేడు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మార్చి రెండో వారం నుంచి ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది.
Our Production No.14 starring @NANDAMURIKALYAN garu under the Direction of debutant Rajendra was launched today! Shoot begins in March 2nd week 🙂
More details soon! #NKR19 pic.twitter.com/tAvs6Meoj7
— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021
ఇక నవీన్ అనే డైరెక్టర్ తో కూడా సినిమా చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖరారు చేశారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నట్టు.. ఎజెంట్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































