యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా, తెలుగు , తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న సాహో మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ గా చేపట్టింది. సాహో మూవీ ప్రమోషన్ లో భాగంగా 23వ తేదీ బెంగుళూరు లో పాత్రికేయులతో ప్రభాస్ సమావేశమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాత్రికేయ సమావేశం లో పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మహాభారతం మూవీ లో అవకాశం వస్తే ఏ క్యారెక్టర్ లో నటించాలనుకొంటున్నారని ఒక పాత్రికేయుడు అడుగగా అర్జునుడు పాత్రలో నటించాలని ఉందని ప్రభాస్ తన మనసులో మాట వెల్లడించారు. సాహో వంటి భారీ యాక్షన్ మూవీ తరువాత ఒక లవ్ స్టోరీలో నటిస్తున్నానని, 20రోజులు షూటింగ్ జరుపుకొందని ప్రభాస్ తెలిపారు. ఇక పై సంవత్సరానికి రెండు చిత్రాలు టార్గెట్ పెట్టుకొన్నట్టుగా ప్రభాస్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: