ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్. బన్నీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమా పై కూడా ఉన్నాయి. ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు అల్లుఅర్జున్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా కూడా వుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దిశా పటానిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా ఆఫర్ ను దిశా ఒప్పుకోవడం ఖాయమేనని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: