విశాల్ ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరగుతున్న నేపథ్యంలో విశాల్ గాయపడిన సంగతి కూడా తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా విశాల్ కోలుకోవడంతో..మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ ను అజర్బైజాన్ లో నిన్నటి నుంచే మొదలుపెట్టారట. అక్కడ అందమైన ప్రదేశాల్లో విశాల్ .. తమన్నాపై రెండు పాటలను, విశాల్ తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ గతంలో రెండు సినిమాల్లో నటించగా.. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కాక విశాల్ తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్ చేస్తున సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుంది.
[youtube_video videoid=vm9dLvsbAhk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























