అతిలోక సుందరి శ్రీదేవి… పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో అలరించారు. ఇప్పుడు శ్రీదేవి బాటలోనే… ఆమె తనయ జాన్వీ కపూర్ కూడా వెళ్ళనుందని బాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… త్వరలో జాన్వీ ఓ హారర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`స్త్రీ` వంటి బ్లాక్బస్టర్ హారర్ మూవీ తరువాత టాలెంటెడ్ యాక్టర్ రాజ్కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ద్వారా హార్ధిక్ మెహతా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా… `రూహ్ అఫ్జా` అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రూహీ, అఫ్సన అనే రెండు భిన్న పాత్రల్లో జాన్వీ దర్శనమిస్తుందట. మరి… ఈ ద్విపాత్రల్లో ఈ టాలెంటెడ్ బ్యూటీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. కాగా… జూన్లో పట్టాలెక్కనున్న `రూహ్ అఫ్జా` వచ్చే ఏడాది మార్చి 20న తెరపైకి రానుంది.
[youtube_video videoid=lDv8wGWOeQw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























