నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్హుడ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్తో నిర్మించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. కాగా ఇంతకుముందు వెంకీ, నితిన్ కాంబోలో వచ్చిన ‘భీష్మ’ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీపై మంచి అంచనాలే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మార్కెట్లో మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్ ధరల పెంపుకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వార్తలు వచ్చాయి. నెట్టింట దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రాబిన్హుడ్ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఈ వార్తలన్నీ నిరాధారమని, యథావిధి రేట్లకే సినిమాను వీక్షించొచ్చని తెలిపింది. ఏపీ వ్యాప్తంగా టికెట్ రేట్ల పెంపు లేదని, కేవలం కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లలో మాత్రమే కొద్దిమేర టికెట్స్ రేట్లలో పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: