సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను తీసుకున్నారు.ఈ సందర్భంగా పూజా హెగ్డే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రేపు ఉదయం 11 గంటలకు పూజా పూర్తి లుక్ ను రివీల్ చేయనున్నారు.అయితే ఇందులో తను స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కూలీ షూటింగ్ విషయానికి వస్తే దాదాపు 80 శాతంకు పైగా షూటింగ్ పూర్తయింది.లోకేష్ కనగరాజ్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున తోపాటు ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈసినిమా కోలీవుడ్ కు మొదటి 1000కోట్ల సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇంతకుముందు లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన లియో ,విక్రమ్ సినిమాలు రికార్డు కలెక్షన్స్ సాధించడం తో కూలీపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























