పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్తో ‘ది రాజాసాబ్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ వంటి ప్రెస్టీజియస్ మూవీస్లో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. రాజాసాబ్ చిత్రానికి మారుతి, హరిహర వీరమల్లు సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇవి సెట్స్ పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తాజాగా ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజెన్లతో ఛాట్ నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్కు ప్రశ్నలు పంపించేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా తన పర్సనల్, కెరీర్ విషయాలపై నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు నిధి అగర్వాల్ సమాధానాలు ఇచ్చింది. ప్రభాస్తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్లో ఎంతో డెడికేషన్ ఉందని తెలిపింది. అలాగే పవన్ కల్యాణ్తో రీసెంట్గాా ఓ సెల్ఫీ తీసుకున్నానని, త్వరలోనే ఆ సెల్ఫీ పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
నెక్ట్ ఇయర్ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవనున్నాయని తెలిపిన నిధి అగర్వాల్, ఆ రెండు చిత్రాలతో నాయికగా ప్రేక్షకులకు మరింత చేరువవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీలో నటిస్తున్నానని వెల్లడించింది. ఇక నిధి అగర్వాల్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రాజాసాబ్, హరిహర వీరమల్లు చిత్రాలపై అంచనాలు మరింతగా పెరిగాయి. అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ మరియు పవర్ స్టార్ అభిమానుల్లో ఫుల్ ఖుషీగా ఉన్నారు.
కాగా ఈ ఛాట్ సందర్భంగా మీరు తెలుగులో మాట్లాడగలరా? అని ఓ నెటిజెన్ ప్రశ్నించగా.. అందుకు బదులిస్తూ, తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు అని, కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్ కాదని నిధి ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. ఇక మరో నెటిజెన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది ఈ బెంగళూరు బ్యూటీ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: