సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ,శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి(ఏషియన్ సినిమాస్ )బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు ఈ కాంబోలో లవ్ స్టోరీ వచ్చింది.నాగ చైతన్య ,సాయి పల్లవి జంటగా నటించిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది దాంతో శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని కూడా ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో చేసే ఛాన్స్ కొట్టేశాడు.అదే ఇప్పుడు ధనుష్ తో తీస్తున్న సినిమా.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండగా ధనుష్ కు జోడిగా రష్మిక నటిస్తుంది దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మొదలుపెట్టిన కొద్దీ రోజులకే ఇదే బ్యానర్ లో ఇప్పుడు మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు శేఖర్ కమ్ముల.ఈమూడో సినిమాగా గురించి మేకర్స్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు.త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.
ఇదిలావుంటే ధనుష్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఈసినిమాకు ధారావి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది అయితే ఇది ఫేక్ న్యూస్ అని అసలు అలాంటి టైటిల్ ఏది ఇంకా అనుకోలేదని టీం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: