మహేష్ బాబుతో ప్లాన్ చేసింది యానిమల్ కాదు, డెవిల్ – సందీప్ వంగా

Animal Movie Director Sandeep Reddy Vanga Responds Over Devil Film with Mahesh Babu

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ సినిమాను రూపొందించి తొలిప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆ ఒక్క మూవీతో ఏకంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రీమేక్ చేసి అక్కడా సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో దేశవ్యాప్తంగా సందీప్ పేరు మారుమోగిపోయింది. స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో సందీప్ తన మూడో సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌లో ‘యానిమల్‌’ సినిమాను తెరకెక్కించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా హైదరాబాద్‍లో మూవీ ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను ఒక సినిమా చేయనున్నట్లు గతంలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మహేష్ కి స్టోరీ వినిపించిన మాట వాస్తవమేనని, అయితే అది ‘యానిమల్’ కాదని స్పష్టం చేశారు. ఆ మూవీకి ‘డెవిల్’ అని టైటిల్ కూడా అనుకున్నామని, అది ‘యానిమల్’ కంటే కూడా హింసాత్మకంగా ఉంటుందని తెలిపారు.

అలాగే ‘డెవిల్’లో హీరో పాత్ర కూడా ఇలాంటిదేనని, అది యానిమల్ కన్నా మరింత వయోలెంట్ పాత్ర అని సందీప్ రెడ్డి వివరించారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ పలు కారణాల వల్ల వర్కవుట్‌ కాలేదని సందీప్‌ వెల్లడించారు. ఒకవేళ ‘యానిమల్’ పక్కా తెలుగు సినిమా అయితే తాను మహేష్ తోనే ఈ ప్రాజెక్ట్‌ చేసేవాడినని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ‘యానిమల్’ తర్వాత సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’, అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయనున్నాడు. వీటి తర్వాత మహేష్ తో సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా ‘యానిమల్’ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషించారు. ఇక ఈ చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ ​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘యానిమల్’ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది.

రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే ‘కబీర్‌ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ‘యానిమల్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే పీవీఆర్ ఐనాక్స్,సినీ పోలీస్ వంటి మల్టీ ఫ్లెక్స్ ల్లో లక్షకు పైగా టికెట్స్ బుక్ అవ్వడం విశేషం. దీంతో విడుదలకు మరో మూడు రోజులు ఉండడంతో 4లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడవ్వచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమా తొలి రోజు సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. అక్కడ రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fifteen =