టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ తొలిభాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్లో సైతం సత్తా చాటి హిందీ బెల్ట్లో రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్గా ‘పుష్ప 2: ది రూల్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా హీరో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన, టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ‘మంగళవారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరై ఆ చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘పుష్ప 2’ సినిమా గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ చిత్తూరు పరిసరాల్లో జరుగుతోందని, ప్రస్తుతం మూవీలో కీలకమైన జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ పోస్టర్లో తాను కనిపించిన గెటప్కి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నామని చెప్పారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. దీంతో మరోసారి ‘పుష్ప’ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
Icon star @alluarjun gives an update on the most anticipated film #Pushpa2TheRule 🔥#AlluArjun #Pushpa #TeluguFilmNagar pic.twitter.com/xKbjXyb540
— Telugu FilmNagar (@telugufilmnagar) November 13, 2023
ఇక ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ఇటీవలే ఢిల్లీలో జరిగిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. అలాగే ‘పుష్ప’ సినిమాకు అందించిన అద్భుతమైన సంగీతానికిగానూ దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు. కాగా ‘పుష్ప 2′ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: