టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ను ముందే ప్రారంభించారు. కానీ కార్తికేయ2 సినిమా ముందు రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. నన్నయ రాసిన అనే లిరికల్ పాటను రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 22వ తేదీన ఈపాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఓ పోస్టర్ తో అనౌన్స్ చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: