తమిళ హీరో విశాల్ కు తెలుగులో ఎంత మంచి పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్లో ఈవెంట్ ను నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుళ్లందరికీ లాఠీ చిత్రం అంకితమిస్తున్నట్టు తెలిపారు. ఒకసారి ఓ పోలీస్ కానిస్టేబుల్ తనతో మాట్లాడుతూ తనను ఓ మాట అడిగాడని అన్నారు. పోలీసుల్లో అందరి మీద సినిమాలు తీస్తారు కానీ కానిస్టేబుల్స్ మీద ఎందుకు సినిమా తీయరు? అని అడిగాడని చెప్పుకొచ్చారు విశాల్. అప్పుడే తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్ కు అంకితం చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు తన పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చారు. నడిగర్ సంఘం భవనాన్ని నిర్మిస్తున్నాను.. ఈ భవనం కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ స్పష్టం చేశాడు.
కాగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: