ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు హవా బాగానే నడుస్తుంది. విభిన్నమైన కథలను, ప్రయోగాత్మకమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసకువస్తుండటంతో వారికి అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. అంతేకాదు అగ్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందులో బాలకృష్ణ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు మహేష్ డైరెక్టర్ పరుశురాం కూడా బాలయ్య కోసం కథను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు శిరీ,ష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. బాలకృష్ణతో పాటు పలువురు డైరెక్టర్లు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. వారిలో పరుశురాం కూడా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరుశురాం మాట్లాడుతూ.. బాలయ్యని ఉద్దేశించి పరశురామ్ మాట్లాడుతూ ఆయన కోసం స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నానని .. త్వరలోనే ఓ కథతో మిమ్మల్ని కలుస్తా… ఈ విషయం అల్లు అరవింద్ గారికి కూడా తెలుసు…” అని హింట్ ఇచ్చేశాడు. మరి చూద్దాం పరుశురాం త్వరలోనే కథను సిద్దం చేసి బాలకృష్ణ దగ్గర గ్రీన్ సగ్నల్ ను సొంతం చేసుకుంటాడేమో..
కాగా ఈమధ్యకాలంలో గీత గోవిందం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు పరుశురాం. ఆ తరవాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీశాడు. ఆ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకూ మరే సినిమాను కూడా కన్ఫామ్ చేయలేదు పరుశురాం. అయితే మధ్య నాగ చైతన్యతో సినిమా అన్నారు కానీ అవి వార్తలుగానే నిలిచిపోయాయి. మరి పరుశురాం తన తరువాత సినిమా ఎవరితో చేస్తాడో చూడాలి..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: