“లక్ ” (2009)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన శృతి హాసన్ , “అనగనగా ఓ ధీరుడు ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్ “, బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న “#NBK107 “, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “#MEGA 154 ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అగ్ర కథానాయిక శృతిహాసన్ చిత్ర సీమలో 13ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. శృతి మాట్లాడుతూ .. ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామనుకున్నాననీ , అభిమానుల ప్రోత్సాహంతో తన ప్రయాణం ఇంతవరకు వచ్చిందనీ , ఈ ప్రయాణం తనకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందనీ , క్రమంగా సినిమా ప్రేమలో పడిపోయాననీ , తన కంటూ సొంత గుర్తింపును సంపాదించుకొని ఉన్నతస్థానం చేరుకోవడానికి సినీరంగం సహాయపడిందనీ , ఇండస్ట్రీకి తాను ఎప్పుడూ రుణపడి ఉంటాననీ , ఈ ప్రయాణంలో తన వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: