లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో అయితే అస్సలు తగ్గేదేలే అంటుంది ఈసినిమా. విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 350 కోట్లకు చేరువయ్యాయి. ఇండియాలో విక్రమ్ రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో విక్రమ్ రూ. 15 కోట్ల షేర్ వరకూ రాబట్టింది. చాలా కాలం తరువాత ఈసినిమాతో మంచి విజయం దక్కినందుకు కమల్ మాత్రం చాలా హ్యాపీ గా ఉన్నారు. ఇప్పటికే పలువురికి బహుమతులు కూడా అందించారు. డైరెక్టర్ కు కారు, సూర్యకు వాచ్, అసిస్టెంట్ డైరెక్టర్లకు బైక్ లు ఇలా తన సక్సెస్ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అదే ఆనందంలో ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించారు కమల్. ఈ సెలబ్రేషన్స్ లో చిత్రయూనిట్ తో పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా. ఈ సక్సెస్ పార్టీలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సందీప్ తన సోషల్ మీడియా ద్వారా ఫొటో పోస్ట్ చేస్తూ ఇన్ క్రెడిబుల్ పీపుల్ తో జాయిఫుల్ నైట్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక ఈ ఫొటోలో సందీప్ తో పాటు కమల్ హాసన్, అనిరుథ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ తో ఉన్నారు.
View this post on Instagram
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: