వేడు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న సినిమా విరాటపర్వం. కాస్త డిఫరెంట్ కథతో వస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి అందరికీ ఆసక్తి ఉంది. అందులోనూ రానా, సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో ఖచ్చితంగా ఈసినిమా విభిన్నంగా ఉంటుందని ఫిక్స్ అయ్యారు అందరూ. ఇక ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈసినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ముందు జులై 1వ తేదీన రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆ తర్వాత ప్రీ పోన్ చేశారు. ఫైనల్ గా ఈనెల 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ కు ఇంకా చాలా తక్కువ టైమ్ ఉండటంతోప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తున్నారు. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిత్రయూనిట్ ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలతో బిజగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా సాయిపల్లవిపై ప్రశంసలు కరిపించాడు. ప్రస్తుతం ఉన్న వారిలో సాయిపల్లవి మంచి నటి అని.. ఈసినిమాలో తన పాత్రను తను తప్పా ఇంకెవరూ చేయలేరని కితాబిచ్చాడు. అంతేకాదు ఈసినిమాలో ఉన్న తను ఒక హైలెట్ అని చెప్పుకొచ్చాడు.
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈసినిమాలో రానా రవన్న పాత్రలో అలానే సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తుంది ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: