దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియన్స్ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈసినిమా లైన్ ను రివీల్ చేశాడు లోకేష్ కనగరాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలుచుకుంటాడు. ఆ తరువాత మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి, తన కూతురును తీసుకుని వెళ్లిపోతాడు. మళ్లీ పోలీసులకు ఆయన అవసరం వస్తుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలతో ఈ కథ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు.
కాగా రీసెంట్ గానే లోకేష్ విక్రమ్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. ఇక ఈసినిమాలో కమల్ తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా.. సూర్య కూడా అతిథి పాత్రలో నటించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: