మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా .. మత్స్య కారులకు నాయకుడిగా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వాల్తేరు వీరయ్య ” మూవీ లో తమ జీవితాలపై పెత్తనం .. తమ మార్కెట్ పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి పోరాటం సాగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మలేషియా లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. త్వరలోనే”వాల్తేరు వీరయ్య ” మూవీ యూనిట్ మలేషియా కు ప్రయాణం కానున్నట్టు సమాచారం. ఈ మూవీ లో చిరంజీవి లుంగీ పైకి కట్టి .. తలపాగా చుట్టి .. బీడీ కాల్చుతూ మాస్ ఆడియన్స్ ను అలరించనున్నారు. ఈ మూవీ తో పాటు చిరంజీవి .”గాడ్ ఫాదర్ “, “భోళా శంకర్”మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: