కామెడీ సినిమాలతోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. మొదటి నుండి కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కాస్త ఆడియన్స్ టేస్ట్ కూడా మారడంతో తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఇక ఇప్పుడు తను కూడా తన పంథాను మార్చాడు. మహర్షి సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ గా చేసి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మెప్పించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమాలో అల్లరి నరేష్ రోల్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో అల్లరి నరేష్ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. స్కూల్ టీచర్ గా ఉండే నరేష్ ఎలక్షన్ డ్యూటీ కోసం విలేజ్ కు వెళ్లడం.. అక్కడ జరిగే పరిణామాలే ఈసినిమా కథ అంటున్నారు.
కాగా ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: