కమర్షియల్ హిట్ “ఫగ్లీ “మూవీ తో కియారా అద్వానీ బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా కథానాయికగా నటించిన సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయికగా తెరకెక్కిన “భూల్ భులయ్యా 2 “, “గోవిందా నామ్ మేరా” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కియారా ప్రస్తుతం “#RC15 “(తెలుగు ), “జుగ్ జుగ్ జియో ”(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కియారా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..హీరోలతో సమానంగా తనకు స్క్రీన్స్పేస్ దక్కుతుండటం ఓ గౌరవంగా భావిస్తున్నాననీ , దర్శకుడు శంకర్-రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “RC15 ” తన కెరీర్లో మరో మైలురాయిలా నిలుస్తుందనీ , శంకర్ సర్ సినిమా స్కూల్ అంటేనే అదొక కొత్త ప్రపంచమనీ , ఆయన ఆలోచనలు, మేకింగ్స్టైల్ విభిన్నంగా ఉంటాయనీ , పొలిటికల్ డ్రామాగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారనీ , తాను నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిదనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: