సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ ను చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబు మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎప్ జగన్మోహన్రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించిందనీ , ఆయన చాలా సింపుల్, మృదు స్వభావి అనీ , ఇతరుల విజ్ఞప్తులు శ్రద్ధగా వింటారనీ , సినిమా టికెట్ రేట్స్ విషయం లో సానుకూలంగా స్పందించారనీ , ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుందనీ ప్రశంసించారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























