మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో చరణ్ కు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది.. మరోవైపు ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దీంతో చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. తన తరువాత సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. అది కూడా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా ప్రకటించిన దగ్గర నుండే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే అమృత్ సర్ లో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Truly an honour to be a part of the Azad Ka Amrit Mahostav to pay tribute to the real heroes who sacrificed their lives for our freedom 🙏🙏#75yearsofIndependence #IndianArmy pic.twitter.com/eV1NoTr5gT
— Ram Charan (@AlwaysRamCharan) April 23, 2022
ఇక ఇప్పటికే అమృత్ సర్ లోని సరిహద్దు జవాన్లతో ముచ్చటించిన రామ్ చరణ్ తాజాగా
అజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్ధ వీరుల నివాళుల కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్దవీరులకు నివాళులు అర్పించారు. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది.. దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాలని చెప్పారు. అంతేకాదు దేశంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అందుకు కారణం దేశ సైనికుల త్యాగాలేనని.. మనం నడుస్తున్న భూమి, పీల్చుతోన్న గాలి మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను ధ్రువ సినిమాలో పోలీసు అధికారిగా నటించడం గర్వంగా ఉందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: