టాలీవుడ్ లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తన సినిమాల్లో డైలాగ్స్ కూడా నిజ జీవితానికి చాలా దగ్గర ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్ననటుడు విజయ్ దేవరకొండ. చాలా తక్కువ కాలంలోనే సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను కూడా వీరిద్దరూ లైన్ లో పెట్టారు. ఆర్మీ నేపథ్యంలో జనగణమన అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమాను రెండు రోజుల క్రితమే లాంచ్ చేశారు మేకర్స్. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా కావడంతో తాజాగా ‘జేజీఎమ్’ చిత్రబృందం ఢిల్లీలో
దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయింది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు తదితరులు రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ‘జనగణమన’ చిత్ర విశేషాలను వారు రాజ్ నాథ్ కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ ‘జేజీఎమ్’ టీమ్ ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఛార్మీ తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
Team #JGM meets honourable Defence minister of India , Shri @rajnathsingh ji at Delhi Last evening !!@TheDeverakonda #PuriJagannadh @Charmmeofficial @PuriConnects #RamuRaoJupally#SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/0XJDlEjlHH
— Charmme Kaur (@Charmmeofficial) March 31, 2022
కాగా ఈసినిమాను పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రూపుదిద్దుకోనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసేశారు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: