మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. చంద్ర బోస్ రచన , సిద్ శ్రీరామ్ ఆలపించిన చూపే బంగారమాయెనా శ్రీవల్లి సాంగ్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్లో 100 మిలియన్స్కి పైగా వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
यूपी वाला होने पर गर्व है।#सुप्रभातUP pic.twitter.com/WuSxv9o67a
— UP Congress (@INCUttarPradesh) February 4, 2022
దేశవ్యాప్తంగా శ్రీవల్లి సాంగ్ కు క్రేజ్ ఏర్పడింది. చిన్నారులతో సహా పెద్దలు కూడా శ్రీవల్లి సాంగ్ లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ తో వీడియోలు రూపొందించి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నవిషయం తెలిసిందే. ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ ను ఆలపించి ప్రేక్షకులనుఅలరించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జనాభా పరం గా ఇండియా లోఅతి పెద్ద రాష్ట్రం. తాజాగా ఆ రాష్ట్రం ఎన్నికలు జరగనున్నాయి. ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ ప్రచారానికి శ్రీవల్లి సాంగ్ ట్యూన్ ఉపయోగించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: