దొరసాని సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ కొట్టాడు. అంతేకాదు కథల విషయంలో కూడా ఆనంద్ దేవరకొండ మొదటి నుండి కాస్త వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇటీవలే పుష్పక విమానం సినిమాతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులోప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో హైవే అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా సాయి రాజేష్ దర్శకత్వంలో బేబి అనే సినిమా చేస్తుండగా ఈసినిమా కూడా సెట్స్ పైన ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు వీటితో పాటు తాజాగా మరో సినిమాను ప్రకటించాడు ఆనంద్ దేవరకొండ. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. గం గం గణేశా అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్ అంటూ ఈ సినిమా యాక్షన్ జోనర్ లో ఉండబోతుందని తెలిపారు.
హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా కేదార్ సెలగమ్ శెట్టి మరియు వంశీ కురుమంచి నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు. కాగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: