ప్రస్తుతం సౌత్ స్టార్స్ హవా నార్త్ లో ఎలా కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాం. బాహుబలి ఫ్రాంచైజ్ నుండి మొదలైన హవా ఆతరువాత కె.జి.యఫ్ , సాహో, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా వరకూ కొనసాగుతూ వస్తుంది. కరోనా పరిస్థితిలో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు మన నార్త్ స్టార్స్ పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా కంగనా తన సోషల్ మీడియాలో యష్తో పాటు అల్లు అర్జున్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సౌత్ కంటెంట్తో పాటు సూపర్ స్టార్స్లో ఇంతలా ఆవేశం ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే అని కొన్ని పాయింట్స్ కూడా జోడించింది. ఈ స్టార్ హీరోలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారని.. అంతేకాకుండా వారు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో ప్రాశ్చాత్య దేశాలను అనుకరించకుండా, వాటిని నిలుపుకుంటారు.. వారు చేసే వృత్తి పట్ల వారికున్న ప్యాషన్ అసమానమైనది అంటూ పొగడ్తలు కురిపించారు. మరి ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ వేయకుండా కంగనా ఉండదు కదా.. ఇక ఈ పోస్ట్ చివరిలో బాలీవుడ్ పై కామెంట్ వేసింది. సౌత్ హీరోలను బాలీవుడ్ వారు భ్రష్టు పట్టించడానికి అనుమతించకూడదంటూ బాలీవుడ్ పై ఇన్ డైరెక్ట్ కామెంట్ వేసింది కంగనా.
కాగా ప్రస్తుతం కంగనా ప్రధాన పాత్రలో అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ‘సీత.. ది ఇన్కార్నేషన్’ సినిమా తెరకెక్కుతుంది. రామాయణ కథ ఆధారంగా సీత పాత్ర ప్రధానంగా ఈసినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కంగనా చేసిన తలైవి సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ సినిమాకు కూడా కథను అందించడం విశేషం. ఈసినిమాను ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: