మళ్లీ ఓటీటీల రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితులు అసలు బాలేకపోవడంతో, థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా చిన్న సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఒక రకంగా ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ పెరిగింది కూడా గత రెండేళ్ల నుండే అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వేవ్ తరువాత కాస్త పరిస్థితులు అనుకూలించడంతో అప్పటివరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలను.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఆపిన సినిమాలను వరుసగా రిలీజ్ చేసేశారు. ఇక ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. మళ్లీ కొన్ని చోట్ల కర్ఫ్యూలు, థియేటర్లు మూసివేయడంతో.. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోతున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాలు మళ్లీ ఓటీటీ బాట పడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కు సిద్దమైంది. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మళ్ళీ మొదలైంది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో ఈసినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసినిమాను థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
కాగా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నఈ సినిమాలో పోసాని, మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: