హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “అఖండ “మూవీ భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో “అఖండ” మూవీ 50 రోజుల వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సుదర్శన్లో ‘అఖంఢ’ చిత్రాన్ని వీక్షించారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ .. సినిమాను థియేటర్స్లో చూస్తేనే మజా ఉంటుందనీ , ఈ మూవీ ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలనీ , ఆ దేవుడే బోయపాటి ని , తనను కలిపాడని అనుకుంటున్నాననీ , ఈ సినిమా సాధించిన విజయం అమోఘం అనీ , అప్పట్లో సుదర్శన్ 70 ఎం ఎం థియేటర్లో ‘సమరసింహారెడ్డి’ శతదినోత్సవ వేడుకకువచ్చాననీ , ఇపుడు సుదర్శన్ 35 ఎంఎంలో “అఖండ ” 50 రోజుల వేడుకకు వచ్చాననీ చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. నందమూరి బాలయ్య నాపై ఉంచిన నమ్మకం మరోసారి నిజమైందనీ , ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డితో ఈ చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్తో పాటు ప్రేక్షకులకు కృతజ్ఞతలనీ చెప్పారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: