మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Woww..
A KANNADA CHANNEL
is Talking abt a
TELUGU SONG #SaamiSaami
being played by
MALAYALAM People in KERALA..Am listening to it in CHENNAI..
Forwarded to me by smone from BOMBAYA perfect PAN INDIA NEWS..
🎶🙏🏻😀#Pushpa@MythriOfficial @alluarjun @iamRashmika @aryasukku https://t.co/Uag7xvTkMy— DEVI SRI PRASAD (@ThisIsDSP) January 12, 2022
చంద్రబోస్ రచన , మౌనిక యాదవ్ గానం చేసిన “సామీ సామీ” అనే మాస్ సాంగ్ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు . ఆ సాంగ్ భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇటీవల కేరళలోని ఓ దేవాలయంలో అక్కడి నాదస్వర బృందం “పుష్ప” సినిమాలోని “సామీ .. సామీ …” పాటను ఆలపించింది. ఆలయ పూజారి పూజలు చేస్తుండగా నాదస్వర బృందం ఈ పాటను ఆలపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా దిగ్విజయ అనే కన్నడ ఛానెల్ దాన్ని ప్రసారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.వావ్.. కేరళలో అక్కడి మలయాళీలు ఆలపించిన తెలుగు సాంగ్ సామీ సామీ గురించి ఒక కన్నడ ఛానల్ చెబుతోందనీ .. బాంబే నుంచి ఎవరో దాన్ని తన కు ఫార్వర్డ్ చేస్తే… తాను చెన్నైలో కూర్చొని ఆ సాంగ్ వింటున్నాననీ … ఇది పర్ఫెక్ట్ పాన్ ఇండియా న్యూస్…’ అంటూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: