పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించనున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాకి రష్మిక ఓకే చేసినట్టు సమాచారం. ఒక సాధారణ యువతి పెద్ద బిజినెస్ విమెన్ గా ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ లో రష్మిక పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుందని
సమాచారం . ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలలో నటించిన రష్మిక తొలి సారి నటించనున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఎలాంటి గుర్తింపు ను తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: