తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బ్రింద” షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
— Trish (@trishtrashers) January 7, 2022
టాలీవుడ్ , కోలీవుడ్ లలో కరోనా విలయతాండవం చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు , థమన్ ఎస్ , వరలక్ష్మి శరత్ కుమార్ , సత్యరాజ్, మీనా లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడ్డారు.ఆ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు.కరోనా నియమాలు పాటిస్తున్నా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఏడాదికి కొంచెం ముందు తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందనీ , ప్రస్తుతానికి తాను కోలుకొంటున్నాననీ , వాక్సినేషన్ వలన ఈరోజు తాను బావున్నాననీ , దయచేసి అందరు వాక్సిన్ వేయించుకొని.. మాస్క్ వేసుకోండనీ ,త్వరలోనే మళ్లీ టెస్టులు చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాననీ , తన కోసం ప్రార్దించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు” అంటూ త్రిష ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: