గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత దెబ్బతిందో చూస్తూనే ఉన్నాం. ఇక మళ్లీ థర్డ్ వేవ్ అలా మొదలైందో లేదో అప్పుడు దాని ప్రభావం సినీ పరిశ్రమపై చూపిస్తూనే ఉంది. ఇప్పటికే దీనివల్ల థియేటర్లు మూతపడుతున్నాయి. దాంతో సినిమాల రిలీజ్ లు కూడా ఆగిపోతున్నాయి. దీనికితోడు వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ప్రతి రోజు తాము కరోనా బారిన పడ్డామని ఎవరో ఒక సెలబ్రిటీ తమ సోషల్ మీడియా ద్వారా చెబుతూనే ఉన్నారు. గత కొద్దిరోజులు కిందటే మంచు మనోజ్, విశ్వక్సేన్, మంచు లక్ష్మీ కరోనా గురించి చెప్పగా.. రెండు రోజుల కిందటే ప్రిన్స్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కరోనా వచ్చింది. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో సత్యరాజ్ కూడా చేరిపోయారు. సత్యరాజ్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
కాగా వీరితో పాటు తమిళ పరిశ్రమకు చెందిన కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారిన పడ్డారు. మరోవైపు తమిళనాడులో ఒమిక్రాన్తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: